Friday, November 24, 2023

Karthika masam 24.11.2023


 


శ్రీ శైవమహాపీఠము, విజయవాడ నందు ఈ రోజు అనగా ది 24/11/2023 శుక్రవారం ఉదయం  శ్రీ శైవమహాపీఠము సహాయ కార్యదర్శి శివశ్రీ ముదిగొండ బాల శశాంక మౌళి బ్రహ్మత్వములో అభిషేకమునకు, అన్నదానము నకు  ధనరూపము లోను, వస్తురూపము లోను శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి సమర్పించుకున్న భక్తుల గోత్ర నామాలు చదివి  లఘున్యాస పూర్వకముగా పంచామృతాలతో, ఫల రసాలతో, నమక, చమక, పురుషసుాక్త, శ్రీసుాక్తాలతో ఏక వార రుద్రాభిషేకం,  శివ సహస్ర నామాలతో వివిధ రకముల పుష్పములతో, బిల్వదళములతో  అభిషేకం జరిగినది. అర్చన, నీరాజన, మంత్ర పుష్పము అనంతరము తీర్ధ ప్రసాద వితరణ జరిగినది. 

సాయంత్రం 6.30 గంటలకు గణార్చన కార్యక్రమం మొదలైంది. గురుస్థాన మహేశ్వరులు శివశ్రీ కాశీనాధుని పూర్ణ రవీంద్ర బాపేశ్వరశర్మ గారు. గణార్చన చేసుకున్నవారు  శివశ్రీ ముదిగొండ కోటేశ్వర శర్మ గారు దంపతులు . బ్రహ్మ గారు శివశ్రీ ములుగు రామలింగం గారు గణార్చన నిర్వహించారు.

గురుస్థాన  మహేశ్వరులు శివశ్రీ కాశీనాధుని పూర్ణ రవీంద్ర బాపేశ్వరశర్మ గారు గణార్చన చేసుకున్నవారికి రజిత ఉమామహేశ్వరుల రూపును బహుకరించినారు. 


శ్రీశైవపీఠము కార్యవర్గ సభ్యులు, ఆరాధ్యులు, ఆరాధ్య బంధువులు హాజరు అయినారు. అనంతరము అన్న ప్రసాద వితరణ జరిగినది.


రేపు  అనగా 25/11/2023 శనివారం గణార్చన చేసుకొనువారు శివశ్రీ చాగంటి శ్యామ్ సుందర్ గారు దంపతులు. 

కావున భక్తులందరు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి తీర్ధ, ప్రసాదములు,ఆశీస్సులు పొందగోరుచున్నాము.


ధన్యవాదములు


ఇట్లు

కార్యవర్గం

శ్రీ శైవమహాపీఠము

విజయవాడ

























No comments:

Post a Comment